Tuesday, July 1, 2025
spot_img

డీఎస్ పార్థివదేహానికి నివాళుర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

Must Read

కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళుర్పించారు.ఆదివారం ఉదయం హైదరాబాద్ నుండి నిజామాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి డీఎస్ పార్థివదేహానికి నివాళుర్పించి,కుటుంబసభ్యులను ఓదార్చారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ధర్మపురి శ్రీనివాస్ విశిష్ట సేవలు అందించారని తెలిపారు.వివిధ పదవుల్లో పనిచేసిన శ్రీనివాస్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని వెల్లడించారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం డీఎస్ చొరవ ఎంతో ఉందని,పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్త ధర్మపురి శ్రీనివాస్ అని అయిన పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రం కోసం సోనియా గాంధీని ఒప్పించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకుంటున్నట్లు డీఎస్ తనతో చెప్పినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు.పదవుల పై ఆశ లేదని,చివరి క్షణంలో పార్టీ జెండాను తన దేహం పై ఉండాలని చెప్పినట్టు రేవంత్ రెడ్డి అన్నారు.మరోవైపు డీఎస్ శ్రీనివాస్ అంతక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు.

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS