Wednesday, June 18, 2025
spot_img

మా ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వడం లేదు,బండిసంజయ్ సంచలన కామెంట్స్

Must Read

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై కేంద్రమంత్రి బండిసంజయ్ సంచలన కామెంట్స్ చేశారు.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుందని,ఆ పార్టీ దుర్మార్గాలకు పాల్పడుతుందని విమర్శించారు.ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకే నిధులు ఇస్తుందని,బీజెపి ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు నిధులు మంజూరు చేయడం లేదని ఆరోపించారు.
ఒకవేళా తాము కూడా ఇదే ధోరణిని ప్రదర్శిస్తే తెలంగాణలో అభివృద్ధి జరగదని అన్నారు.ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలను నిధులు ఇవ్వకుండా అవమానిస్తారా అని మండిపడ్డారు.తాము కూడా కాంగ్రెస్ ఎంపీలకు నిధులు ఇవ్వకపోతే ఏం చేస్తారని నిలదీశారు.అందరికి సమానంగా నిధులు ఇవ్వాలని,లేనిపక్షంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పై తిరగబడినట్లే కాంగ్రెస్ ప్రభుత్వంపైన తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు.

Latest News

ఏటీఎమ్‌లలో పెరిగిన వంద, 2 వందల నోట్ల లభ్యత

ఏటీఎమ్‌లలో వంద, రెండు వందల నోట్ల లభ్యత పెరిగింది. ఏటీఎమ్‌లలో ఆ డినామినేషన్‌ నోట్లను సెప్టెంబర్ 30లోపు మరింత ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS