Saturday, October 4, 2025
spot_img

రాష్ట్రంలో 50 శాతం రుణమాఫీ కూడా పూర్తికాలేదు

Must Read

-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో 50శాతం రుణమాఫీ కూడా పూర్తి కాలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.బుధవారం సికింద్రాబాద్ లో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు ఉత్సవ్ కార్యక్రమాన్ని అయిన ప్రారంభించారు.ఈ సంధర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశారు.మాజీముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు తూట్లు పొడుస్తూ,రైతు రుణమాఫీను గందరగోళంగా మార్చారని విమర్శించారు.రుణమాఫీకి సంబంధించిన వివరాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.ఆరు గ్యారంటీల పై ఉద్యమాలు చేసేందుకు సిద్ధమవుతామని తెలిపారు.రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ధీమా వ్యక్తం చేశారు.రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం తమ లక్ష్యమని అన్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This