Friday, October 3, 2025
spot_img

రైతు రుణమాఫీ పై స్పందించిన రాహుల్ గాంధీ

Must Read

ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసి ఊరటను ఇచ్చింది.ఈ సందర్బంగా రైతు రుణమాఫీ పై రాహుల్ గాంధీ స్పందించారు.తెలంగాణ రైతు సోదర సోదరమణులకు శుభాకాంక్షలు..ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం రెండో విడత రైతు రుణమాఫీ చేసింది.. రాష్ట్రంలోని 6.4 లక్షల రైతు కుటుంబాలకు రూ.1.5 లక్షల వరకు రుణమాఫీ చేయడం ద్వారా ఉపశమనం కల్పిస్తోందని పేర్కొన్నారు.ఒకవైపు,బీజేపీ దేశంలోని రైతులను అప్పుల ఊబిలో బంధించి,వారి డిమాండ్ మరియు ఎం.ఎస్ .పి యొక్క చట్టపరమైన హామీ అవసరాన్ని తిరస్కరించింది,సాధ్యమైన ప్రతిచోటా వ్యవసాయ కుటుంబాలకు సహాయం అందించేందుకు కాంగ్రెస్ కృషి చేస్తోందని తెలిపారు.భారతదేశ రైతులకు ఎం.ఎస్.పి యొక్క చట్టపరమైన హామీని అందించడం ద్వారా భారతదేశం ఈ అప్పుల ఊబి నుండి బయటపడుతుందని వెల్లడించారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This