Tuesday, July 8, 2025
spot_img

రేపటి నుండి ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం

Must Read
  • గాంధీ ఆసుప్రతిలో దీక్ష విరమించిన మోతిలాల్
  • నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలననే డిమాండ్ తో దీక్ష
  • మీడియా ముందుకు వచ్చి,కొబ్బరి నీళ్ళు త్రాగి దీక్ష విరమించిన మోతిలాల్
  • క్రియేటిన్ లెవెల్స్ పెరిగి కిడ్నీ,లివర్లు పడయ్యే పరిస్థితి వచ్చింది

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత మోతీలాల్ నాయక్ మంగళవారం దీక్ష విరమించారు.తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యలు,ఉద్యోగాల భర్తీ తదితర డిమాండ్స్ తో గత 9 రోజుల నుండి గాంధీ ఆసుప్రతిలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.ఉదయం మీడియా ముందుకి వచ్చి నిరాహార దీక్ష విరమిస్తూన్నట్లు ప్రకటించారు.కొబ్బరి నీళ్ళు తాగి దీక్షను విరమించారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ తెలంగాణలో 25-30 ఏళ్ల నిరుద్యోగ యువతి,యువకులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.నిరుద్యోగుల డిమాండ్స్ పరిష్కరించాలని గత తొమ్మిది రోజుల నుండి దీక్ష చేస్తున్న ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా పెంచలేదని మండిపడ్డారు.దీక్ష చేయడం వల్ల తన ఆరోగ్యం మొత్తం క్షీణించిందని, క్రియేటిన్ లెవెల్స్ పెరిగి కిడ్నీ,లివర్లు పడయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే గ్రూప్ 01 ను 1:100 చేయాలని అయిన కోరారు.అదేవిధంగా గ్రూప్ 02,గ్రూప్ 03 పోస్టులను పెంచలని,డీఎస్సీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రేపటి నుండి ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

Latest News

తెలంగాణలో ఫిల్మ్ స్టూడియో

రేవంత్ రెడ్డితో ప్ర‌ముఖ సినీ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ భేటీ యానిమేష‌న్‌, వీఎఫ్ఎక్స్ స్టూడియోల ఏర్పాటుకు సంసిద్ధ‌త‌ తెలంగాణలో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS